ఆ వ్యాధి వల్ల నరకం చూసిన మహేష్ బాబు.. చివరకు నమ్రత ఏం చేసిందంటే?

by Disha Web Desk 9 |
ఆ వ్యాధి వల్ల నరకం చూసిన మహేష్ బాబు.. చివరకు నమ్రత ఏం చేసిందంటే?
X

దిశ,సినిమా: టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్‌నెస్ అండ్ హెల్త్ విషయంలో బాగా కేర్ తీసుకుంటాడు. కానీ మైగ్రేన్ మాత్రం వెంటాడిందని, ఆ బాధ భరించలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘ఒకానొక సమయంలో మైగ్రేన్ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాను. దానికి చికిత్స లేదని చాలామంది చెప్పారు. అయినా కూడా ఎంతో మంది డాక్టర్లను కలిశాను. ఎన్నో మందులు వాడాను. అయినా ఉపశమనం లభించలేదు. పెయిన్ కిల్లర్స్ వాడుతూ కాలం గడిపాను. కొన్నిసార్లు రోజులో ఆరు నుంచి ఏడు గంటల పాటు ఈ వ్యాధి వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక నా బాధను చూసిన నమ్రత.. తన ఫ్రెండ్ సహాయంతో డాక్టర్ సత్య సింధూజను కలిసి చక్రసిద్ధ నాడీ వైద్యం చేయించింది. ఆ చికిత్స తర్వాత నా మైగ్రేన్ మటుమాయమైంది’ అని చెప్పుకొచ్చాడు మహేష్.

Read More: Mahesh Babu అంత రొమాంటిక్‌నా.. నమ్రత నుంచి ముద్దు కోసం అంత పని చేశాడా?

Next Story

Most Viewed